YS Viveka Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన సీబీఐ సూత్ర ధారుల అరెస్టునకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారడం, న్యాయమూర్తి సమక్షంలో అతని సాక్షాన్ని నమోదు చేయడంతో కేసు చివరి దశకు చేరుకుందని అందరూ భావించారు. ఈ తరణంలోనే నిందితుల తాలూకు వ్యక్తులు కడప కోర్టులో వివేకా కుటుంబంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
YS Viveka Case: ఒక క్లారిటీకి వచ్చిన సీబీఐ
ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల క్రితం వరకూ సీబీఐ వద్ద పలువురు ఇచ్చిన వ్యాంగ్మూలాలు బయటకు వచ్చాయి. ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం ఎవరు చేశారు. ? ఎవరు ఈ హత్య చేశారు..? ఎవరు చేయించారు..? అనే విషయాలపై సీబీఐ ఒక క్లారిటీకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. సంబంధిత నిందితులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైతే వారు నోటీసులు తీసుకోలేదని కూడా వార్తలు వచ్చాయి.
YS Viveka Case: సీబీఐకి అడ్డంకులు తొలగిపోతే..
ఈ తరుణంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంచెలంచెలుగా సాగుతోందని వర్ల రామయ్య అన్నారు. ఈ కేసు దర్యాప్తును కొన్ని పెద్ద శక్తులు అడ్డుపడుతున్నాయని అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అంతఃపుర రహస్యాన్ని ఛేదించడం సీబీఐకి పెద్ద పనేమీ కాదని అన్నారు. అయితే సీబీఐ కున్న అడ్డంకులు తొలగిపోతే వాస్తవాలన్నీ చకచకా బయటకు వస్తాయని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.