NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupathi RUIA: ఎందుకీ సెక్రెట్లు – మరణం వెనుక మర్మం..!? 11 – 45 – 56..!?

Tirupathi RUIA: తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మద్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నది. రూయా ఆసుపత్రిలో మృతుల సంఖ్య చాలా ఎక్కువేననీ, కానీ ప్రభుత్వం వాస్తవ విషయాలను కప్పిపెడతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రూయాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్బంధాలు చేశారని టీడీపీ, సీపీఐ  నాయకులు మండిపడుతున్నారు.

Tirupathi RUIA covid deaths secrets
Tirupathi RUIA covid deaths secrets

ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారని చెబుతున్న అధికారులు ఆ మృతుల వివరాలను కూడా ఇంత వరకూ వెల్లడించలేదని అంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ దుర్ఘనను ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఆపాదించి బుదరచల్లే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఘటన జరిగిన సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందారని అధికారికంగా వెల్లడించారు. అయితే సోమవారం జరిగిన సాధారణ మరణాలను కూడా ఆక్సిజన్ అందక మృతి చెందారని టీడీపీ వారు ఆరోపిస్తున్నాయని వైసీపీ మండిపడుతోంది.

Tirupathi RUIA covid deaths secrets
Tirupathi RUIA covid deaths secrets

Tirupathi RUIA: మరణాలపై గందరగోళం

కోవిడ్ మరణాలపై అధికారులే గందగోళానికి కారణం అవుతున్నారు. సోమవారం నాడు రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 45 మంది మృతి చెందినట్లు ఆ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ ఓ జాబితా విడుదల చేశారు. అయితే అధికారులు మాత్రం ఆక్సిజన్ అందక మృతి చెందిన 11 మంది బాధితుల పేర్లు వెల్లడించలేదు. ప్రభుత్వం మాత్రం మృతి చెందిన ఆ 11 మందికి పది లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Tirupathi RUIA covid deaths secrets
Tirupathi RUIA covid deaths secrets

మరో పక్క ఒక్క రూయా ఆసుపత్రిలోనే 45 మంది మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతుండగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో చిత్తూరు జిల్లాలో 24 గంటల వ్యవధిలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు పేర్కొనడంతో ప్రభుత్వం మరణాల లెక్కను దాస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ లెక్కలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి జాబితాను అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని  బాధిత కుటుంబాలకు అందజేసి విమర్శలకు తావు రాకుండా చూసుకోవాలి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N