Vijaya sai Reddy Vs Raghurama: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణరాజుకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఈ నెల 10వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిరెడ్డికి నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎంపి రఘురామకు విజయసాయిరెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. పిటిషన్ లు వేస్తే సైలెంట్ గా ఉంటామా మాకు ఫిర్యాదులు చేయడం వచ్చు అన్నట్లు రఘురామ బ్యాంకు ఫ్రాండ్ కేసును విజయసాయి తెరిపైకి తీసుకువచ్చారు.
ఎంపి రఘురామకు చెందిన కంపెనీ రూ.826 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తమ లేఖపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారనీ, విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని విజయసాయి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సో..విజయసాయిపై రఘురామ కోర్టులో పిటిషన్ వేసినందుకు కౌంటర్ గా విజయసాయి ఆయనపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు అందజేశారు. బ్యాంకు ఫ్రాడ్ కు సంబంధించి రఘురామపై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగత తెలిసిందే. విజయసాయి ఫిర్యాదుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏ విధంగా స్పందిస్తారు. దీనిపై రఘురామ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.
ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు. pic.twitter.com/Tc6o5N7C5J
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 8, 2021