Telangana: కరోనా కల్లోలం కొనసాగుతున్న ఈ సమయంలో కారణం ఏదైనా కానీ… ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్నారా? మీరు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో ఇంకా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ లో పరిస్థితి ఇది..
లాక్ డౌన్ సీరియస్ గా అమలు జరగడం లేదనే కామెంట్ల నేపథ్యంలో పోలీస్ శాఖ నిబంధనలు కఠినంగా అమలుచేస్తోంది. నిబంధనలు అతిక్రమించిన వారికి ఒక్కొకరికి రూ.1000 ఫైన్లు వేశారు. కొందరి బండ్లు సీజ్ చేసేశారు. కొందరు డెలివరీ బాయ్స్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్న పేర్కొన్న పోలీసులు అలా చేసే వారి పై కఠిన చర్యలు తప్పవు అని తేల్చిచెప్పారు. గూడ్స్ వాహనాలకు రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో కీలక ఆదేశాలు…
కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను కూడా లాక్ డౌన్ సమయంలో మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరమైన వామనాలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. దీంతో పాటుగా సంబంధిత పాస్లు ఉన్నవారికి సైతం ఓకే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణలోకి ప్రవేశించే వారు తగు అనుమతి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని పేర్కొంటున్నారు.