ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఈ దఫా పరిటాల సునీత విజయం ఖాయమే నా? ఆమె గెలుపు గుర్రం ఎక్కుతారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. స్థానికంగా మార్పును కోరుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విషయంలో స్థానికంగా ఉన్న వ్యతిరేకత.. సునీతకు ప్లస్ కానుందని తెలుస్తోంది. ఇదే సమయంలో మహిళా సెంటిమెంటు కూడా మరోసారి కలిసి రానుందని తెలుస్తోంది.
2009. 2014 ఎన్నికల్లో సునీత విజయం దక్కించుకున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ప్లేస్ కూడా పొం దారు. నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి చేశారు. దీనికితోడు.. కియా సంస్థ రాక వెనుక కూడా మంత్రిగా ఆమెప్రయత్నం కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ.. ప్రస్తావనకు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఆమె చేస్తు న్న ప్రచారానికి కూడా.. మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలోనే ఉండడం.. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో సునీత సక్సెస్ అయ్యారు.
చంద్రబాబు నుంచి ఎలాంటి సూచనలు వచ్చినా.. ముందున్నారు. ఆయన చెప్పిన ప్రకారమే కార్యక్రమా లను ముందుకు తీసుకువెళ్లారు. కేడర్లోనూ బలమైన నాయకురాలిగా వ్యవహరించారు. ఇక, ప్రజలకు అందుబాటులో ఉన్న కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ పరిటాల కుటుంబానికి ఇప్పుడు ప్లస్ అయ్యాయి. ఇక శ్రీరామ్కు ఎలాగూ ధర్మవరం సీటు దక్కలేదు. పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో ఇప్పుడు శ్రీరామ్ కూడా రాఫ్తాడులో తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.
ఇక, వైసీపీ వ్యతిరేకత ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేపై మాత్రం నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. తోపుదుర్తి సోదరులు అంతా తామే అన్నట్టుగా వ్యవహరించిన తీరు.. ప్రతి పనికీ.. లంచాలు తీసుకున్నా రన్న వాదన ఏ సమస్య చెప్పుకొందామన్నా.. అందుబాటులో లేక పోవడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.. రోడ్డు ఎందుకు? అని గతంలో చేసిన ప్రకటనలు వంటివి ప్రజల్లో చర్చకు చెప్పడంలో సునీత విజయం సాధించారు. దీంతో రాప్తాడులో సునీత విజయం ఖాయమనే వాదన వినిపిస్తోంది. గతంలో తమకు అందుబాటులో ఉన్న సునీతను గెలిపించుకుంటామని.. స్థానికులు చెబుతుండడం గమనార్హం.