YCP MLC Anantababu: ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. అటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుండి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్సీ అనంత బాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అత్యాచర నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత కేసును ఆల్టర్ చేశారు. అనంత బాబు అరెస్టునకు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరో పక్క పోస్టుమార్టం నివేదికలోనూ సుబ్రమణ్యంది హత్యేనని తెలినట్లు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అనంత బాబు అరెస్టునకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన పోలీసు ఉన్నతాధికారి వద్ద లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయనను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారనీ, ఎమ్మెల్సీ అనంత బాబు తానే ఈ హత్య చేయించినట్లు విచారణలో అంగీకరించాడని కూడా తెలుస్తొంది. అనంతబాబు అరెస్టు సమాచారాన్ని శాసనమండలి చైర్మన్ కు అందజేసిన తరువాత పోలీసు అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెళ్లడించే అవకాశం ఉందని తెలుస్తొంది. డీఐజీ పాల్ రాజు మరి కొద్ది సేపటిలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ కేసులో అనంత బాబుతో పాటు ఆయన అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తొంది. సుబ్రమణ్యం ను కొట్టి చంపినట్లు పోలీసుల విచారణలో అనంత బాబు అనుచరులు అంగీకరించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని టీడీపీ డిమాండ్ చేస్తొంది. బాధిత కుటుంబం ఆలస్యంగా స్టేట్ మెంట్ ఇచ్చిందని అధికార వైసీపీ నేతలు అంటున్నారు. ఈ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం ఏమి చేయడం లేదని, టీడీపీనే దీన్ని రాజకీయం చేస్తొందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.