YS Jagan: వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న హూజూర్నగర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘటన కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో విచారణకు హజరు కావాలంటూ ఇటీవల నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. అయితే జగన్ కు ఇంకా సమన్లు అందకపోవడంతో ఆయన తరపు న్యాయవాదులు సమన్లు అందలేదని కోర్టుకు వివరించారు.
YS Jagan: జగన్ హజరుపై ఏప్రిల్ 26వ వరకూ స్టే
ఈ నేపథ్యంలో ఈ నెల 31వతేదీలోగా జగన్ కు సమన్లు అందేలా చూడాలని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు అందకముందే జగన్ తరపున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణకు జగన్ హజరుపై ఏప్రిల్ 26వ వరకూ స్టే ఇచ్చింది.
హూజూర్నగర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
2014 ఎన్నికల సమయంగా హుజూర్నగర్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రోడ్డు నిర్వహించారన్న అభియోగంపై జగన్ తో సహా మరో ఇద్దరిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది. మిగిలిన ఇద్దరు కోర్టు విచారణలకు హజరైన నేపథ్యంలో వారిపై కేసు గతంలోనే ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. జగన్ గత రెండు పర్యాయాలు జరిగిన కోర్టు విచారణలకు హజరుకాకపోవడంతో ఇటీవల కోర్టు విచారణకు హజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.