YSR Death Anniversary: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగంగా స్పందించారు. “నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా” అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.
మరో పక్క వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు నివాళులర్పించారు. తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను షర్మిల గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాజశేఖరరెడ్డిది అని అన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన మహానేత వైఎస్ అని కొనియాడారు. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో 700 మంది పేదల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు.
Supreme Court: ఆర్ – 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు లభించని ఊరట