151 ఎమ్మెల్యేలు ఉన్న వైసిపి పార్టీ లో అసమ్మతి చెల్లుచీటీ అని రాజకీయ విశ్లేషకులు అంతా జగన్ గెలిచిన తొలినాళ్లలో వ్యాఖ్యానించారు. కానీ ఒకే ఒక్క ఎంపీ యొక్క సమ్మతి వైసిపి పార్టీ కూసాలనే కదిలిస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. అతనే రామకృష్ణంరాజు. ముందేమో ఆయన చూపు మొదటినుండి బీజేపీ వైపే ఉంది అని అనుకున్నారు. తర్వాత ఇది అంతా మోడీ వేసిన స్కెచ్ అన్నారు. చివరికి ఆయన మొన్న పవన్ కళ్యాణ్ ని విపరీతంగా పొగిడేసరికి ఇందులో పవన్ పాత్ర ఏమిటి అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటి మధ్య రాజుగారు జగన్ కు వరుస బెట్టి లేఖలు రాస్తూనే ఉన్నారు.
ఇప్పటి వరకూ రాజు గారు రాసిన లేఖలు అన్నింటిలో విమర్శలు మరియు తిట్లు లేకపోయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన వీటన్నింటిలో వ్యవహరించడం గమనార్హం. అయితే తాజాగా ఆయన రాసిన మరొక లేఖలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకు రావడం విశేషం. రాష్ట్రంలో వారంతా అష్ట కష్టాలు పడుతున్నారని…. కొన్ని నెలలుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోమని లేఖలో కోరారు. మొదటి నుండి జగన్ పైన రాజుగారు సాఫ్ట్ యాంగిల్ చూపిస్తూనే ఉన్నారు. తనకు అధినేత నుంది ఏమీ సమస్య లేదని కేవలం పార్టీ కేడర్ తోని చిక్కులు ఉన్నాయని రాజు గారు నొక్కి వక్కాణించారు. గతంలో బహిరంగంగా అతను జగన్ను చాలా విపరీతమైన వ్యాఖ్యాతో విమర్శించినప్పటికీ విషయం పెద్దయ్యేకొద్దీ జగన్ జపం చేస్తూనే ఉన్నాడు.
ఇక ఈ లేఖ విషయానికి వస్తే… మన ప్రభుత్వం 20,64,379 మంది కార్మికుల పేర్లను ఆధార్ తో లింకు చేయాలని సంకల్పించింది. అయితే ఇప్పటివరకు 10,66,265 మంది మాత్రమే లింకయ్యారు. మిగతా కార్మికుల పేర్లను కూడా ఆధార్ తో అనుసంధానం చేసేలా గ్రామ, వార్డు వలంటీర్లకు ఆదేశించండి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్ల నుంచి లేబర్ వెల్ఫేర్ ఫండ్ రూపంలో రూ.1364 కోట్లు వసూలు చేసినా, ఇప్పటివరకు రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులు ఇపుడు బయటకు తీసి ఆదుకోమని రఘురామకృష్ణరాజు కోరారు.
కాబట్టి ఈయన మళ్లీ జగన్ కు దగ్గర అయ్యేందుకు రాష్ట్రంలోనే సమస్యలను అతని ముందు పెట్టి వీటిని మీరు తప్ప ఎవరూ పరిష్కరించలేరు అని పొగుడుతున్నారా లేదా జగన్ పై ఇంకా తనకు నమ్మకం ఉన్నట్లు జనాలకు చూపిస్తున్నారా…. లేకపోతే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడం లేదని అసలు ఇటువంటి ఎన్నో సమస్యలు ఈ కష్టకాలంలో ప్రభుత్వం కళ్ళకి కనపడటం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా…. అన్నది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇక ఈ లేఖకి జగన్ రెస్పాన్స్ మరియు అతని రెస్పాన్స్ కు రాజుగారి సమాధానం చూస్తే మనం కూడా ఒక అంచనాకు వచ్చేయవచ్చు. ఈలోపల ఇంకెన్ని లేఖాస్త్రాలు వస్తాయో…