Soundarya: హీరోయిన్ సౌందర్య తెలియని వారు ఎవరు ఉన్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య తెలుగులో తిరుగులేని క్రేజ్ కలిగిన హీరోయిన్. 90లలో చేతినిండా సినిమాలతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రజనీకాంత్ వంటి టాప్ మోస్ట్ హీరోలందరి సరసన నటించి అనేక బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకోంది. విక్టరీ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అది గ్యారెంటీ హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఈ ఇద్దరు కలిసి అనేక సినిమాలు చేశారు. నటనపరంగా ఇంకా డాన్స్ పరంగా సౌందర్య అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించేది.
అటువంటి సౌందర్య ఒక రాజకీయ పార్టీ కార్యక్రమానికి సంబంధించి హెలికాప్టర్ లో బయలుదేరుతున్న సమయంలో మరణించడం జరిగింది. 2004వ సంవత్సరంలో ఆమె మరణించింది. సరిగ్గా పెళ్లయి ఏడాదికాకముందే సౌందర్య మరణించడం ఆమె కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో అప్పటి సౌందర్య మరణం గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ… సౌందర్య చనిపోయిందన్న మరణ వార్త తెలుసుకొని ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో గుండె ముక్కలు అయిపోయిన పరిస్థితి నెలకొంది.
సౌందర్యకి బదులు నేను చనిపోయిన బాగుండేది అన్న ఫీలింగ్ ఏర్పడింది. ఎందుకంటే నాకు పిల్లలు లేరు. అప్పటికే జీవితం మొత్తం చూశాను. చనిపోయే సమయానికి సౌందర్యానికి పెళ్లయి ఏడాది కావస్తోంది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదని స్వయంగా సౌందర్య తల్లి నాతో తెలియజేసింది అంటూ సౌందర్యతో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి చెబుతూ ఆమని ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!