సాధారణంగా ఇండస్ట్రీలో అభిమానుల విషయంలో బాలయ్య బాబు గురించి నెగటివ్ వార్తలు వింటుంటాం. బయట చాలా సందర్భాలలో అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయినా గాని తాను కొట్టిన పెద్దగా తన అభిమానులు పట్టించుకోరని.. బాలయ్య బాబు చేయి తాకిందని అనుకుంటారు.. అంటూ చాలా సమయాలలో చేయి చేసుకున్న విషయంలో బాలయ్య తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు.. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద… సాంగ్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో బాలయ్య షూటింగ్ చూడటానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున షూటింగ్ స్పాట్ కి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో అభిమాన సంఘానికి సంబంధించి ఓ వ్యక్తి బాలయ్య బాబుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించడం జరిగిందట. దీంతో బాలయ్య బాబు ఏమాత్రం ఆలోచించకుండా తన అభిమాని కోరిక తీర్చే రీతిలో అతని ఇంటికి వెళ్లి.. భోజనం చేశారట. తన అభిమాన హీరో స్వయంగా తన ఇంటికి రావడంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేవట.
అంత మాత్రమే కాదు షూటింగ్ జరుగుతున్న స్పాట్ లో వచ్చిన అభిమానులకు కూడా ప్రత్యేకంగా బాలయ్య బాబు.. భోజనం ఏర్పాటు చేయడం జరిగిందట. సాధారణంగా బాలయ్య బాబు అభిమానులతో వ్యవహరించే శైలి దురుసుగా ఉంటే ఇప్పుడు మాత్రం… చాలా ఆప్యాయంగా అభిమానులకు భోజనం పెట్టడం సంచలనంగా మారింది. ఇటీవల బాలయ్య బాబు కరోనా బారిన పడటం తెలిసిందే. అదే సమయంలో “NBK 107” సినిమా యూనిట్ వాళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడటం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా నుండి బాలయ్య కోలుకోవడంతో… మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యారు. వాస్తవానికి ఈ సినిమా దసరాకి వస్తుందని భావించగా…మధ్యలో షూటింగ్ బ్రేక్ పడటంతో.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!