KGF 2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా చేసిన “కేజిఎఫ్ 2” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. అంతకు ముందు “కేజిఎఫ్” కూడా భారీ ఎత్తున విజయం సాధించడంతో…”కేజిఎఫ్ 2″ పై అంచనాలు ఉన్నాగాని … ఏమాత్రం.. ఆడియన్స్ అంచనాలు తగ్గకుండా… సినిమా ఉండటంతో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఏప్రిల్ 14 వ తారీకు రిలీజ్ అయిన “కేజిఎఫ్ 2” ఇంకా విజయవంతంగా సినిమా థియేటర్లలో రన్ అవుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అంతకు ముందు భారీగా ప్రభావితం చేయడం తెలిసిందే. అయితే ఆ తర్వాత “కేజిఎఫ్ 2” రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా ఒక మార్క్ సెట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు “కేజిఎఫ్ 2” ఎఫెక్ట్ కి ఐకాన్ స్టార్ బన్నీ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “పుష్ప 2” పార్ట్ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
మొదటి భాగం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయడంతో… రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో “కేజిఎఫ్ 2” అతి పెద్ద భారీ విజయం సాధించడంతో సుకుమార్ దీన్ని మించి.. “పుష్ప 2” ఉండే విధంగా.. స్క్రిప్టు మొత్తం చేంజ్ చేసినట్లు టాక్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో ఆల్ రెడీ రాసిన కథను మళ్ళీ తిరిగి రాస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వినపడుతోంది. ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్లే… “పుష్ప” సెకండ్ పార్ట్ లో వైవిధ్యంగా వుండేలా సుకుమార్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు అని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!