బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైన తొలి నాళ్లలో హౌస్ లోకి వచ్చిన ఇంటి సభ్యులను చూసి… అంతా కొత్త మొహాలు తెలియని వారు ఉండటంతో ఈ సీజన్ డమ్మీ సీజన్ అని కామెంట్లు చేశారు. హౌస్ లో ఎంటర్ అయినా లాస్య, నోయల్ , అమ్మ రాజశేఖర్ లాంటివారు తెలిసిన ముఖాలు తప్ప మిగతా అంతా తెలియని ముఖాలే అన్నట్టు కామెంట్లు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ సీజన్ కావటంతో బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ కూడా పడిపోయే పరిస్థితి నెలకొంది.
దీంతో వెంటనే హౌస్ లోకి వైల్డ్ కార్డు రూపంలో కొత్త కొత్త మొక్కలను తీసుకువస్తూ మసాలా ఎక్కువ ఉండేలా… అందాల ఆరబోత చేసేలా కుర్రహీరోయిన్ స్వాతి దీక్షిత్ నీ దింపటం జరిగింది. దీంతో ఈ ముద్దుగుమ్మ హౌస్లో అడుగుపెట్టడంతో ఎంట్రన్స్ లోనే ఆమెను ఇంప్రెస్ చేసేలా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఎవరి వారు రెచ్చి పోయారు కానీ అఖిల్… స్వాతి దీక్షిత్ ని తన పాటతో ఇంప్రెస్ చేసి టాస్క్ గెలిచాడు.
కాగా స్వాతి దీక్షిత్ రావటంతో చాలా మంది ఇక హౌస్ లో కొత్త కొత్త రిలేషన్లు ఏర్పడతాయని మసాలా బాగుంటుందని భావించారు. కానీ ఇంతలోనే ఆమె వచ్చిన వారం రోజుల తర్వాత ఎలిమినేట్ అవ్వటంతో… ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడుతూ ఉండటంతో ప్రేక్షకులలో షోపై బోరు కొడుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వినబడుతున్నాయి. కనీసం హౌస్ లో గ్లామర్ లేకుండా ఈ విధంగానే రాబోయే రోజుల్లో ఉంటే…షో ఫ్లాప్ అవడం గ్యారెంటీ అని నెటిజన్లు అంటున్నారు. ఇలా అయితే నాగార్జున కూడా కాపాడలేరు అని అంటున్నారు. కారణం చూస్తే మరోపక్క ఐపీఎల్ సీజన్ ఉన్న నేపథ్యంలో ఆడియన్స్ మైండ్ డైవర్ట్ అవటం గ్యారెంటీ అని బయట టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!