తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయ్యి రెండు వారాలు కావస్తోంది. గతం లో ప్రసారమైన సీజన్ లతో పోల్చుకుంటే సీజన్ ఫోర్ లో అస్సలు స్టఫ్ లేదని ప్రేక్షకులనుండి వస్తున్న స్పందన. ముఖ్యంగా చెప్పుకోదగ్గ సెలబ్రిటీలు హౌస్ లో ఎవరూ లేరని చాలామంది సోషల్ మీడియాలో వీక్షకులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు టెలివిజన్ ప్రేక్షకులకు ఆకలి తీర్చడానికి వైల్డ్ కార్డుని గట్టిగా ఉపయోగించుకుంటూన్నట్లు తెలుస్తోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే గత ఏడాది హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కమెడియన్ ఫేమ్ కుమార్ సాయి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఈ శనివారం ప్రసారమయ్యే షోలో యంగ్ బ్యూటీ హాట్ హీరోయిన్ హౌస్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్లామర్ డోస్ పెంచాలని బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు ఫుల్ గా డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగా హౌస్ లోకి స్వాతి దీక్షిత్ అనే హీరోయిన్ ని పంపించడానికి డిసైడ్ అయినట్లు టాక్. బెంగాలీ అమ్మాయి అయినా స్వాతి దీక్షిత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన “జంపు జిలాని” సినిమాలో హీరోయిన్ గా చేసింది. అందాల ఆరబోతలో వెండితెరపై రెచ్చిపోయి స్వాతి దీక్షిత్ ప్రస్తుతం హౌస్ లోకి అడుగు పెట్టనున్నటూ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఇంత హాట్ అమ్మాయి అయితే మేం తట్టుకోగలమా బాబోయ్…. అంటూ కుర్రకారు ఈ వార్తపై స్పందిస్తున్నారు. మరోపక్క ఐపిఎల్ ఆదివారం నుండి స్టార్ట్ కానున్న తరుణంలో బిగ్ బాస్ రేటింగులు పడి పోకూడదని షో నిర్వాహకులు ఈ విధంగా హౌస్ లో గ్లామర్ డోస్ ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!