Pushpa: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న “పుష్ప” సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్.. అనేక రికార్డులు సృష్టించటంతో.. పుష్ప రిలీజ్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బన్నీ ఫస్ట్ టైం పాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తూ ఉండటంతోపాటు గత సినిమాలకు భిన్నంగా అల్లు అర్జున్ మేకోవర్ పూర్తిగా మారిపోవడంతో సినిమా స్టోరీ ఏంటి అన్న దానిపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఎన్నడూ లేని విధంగా లారీ డ్రైవర్ పాత్రలో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తూ ఉండటంతో .. సామాన్య సినీ లవర్ కి కూడా సినిమా స్టోరీ ఏంటి అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
పైగా చాలా స్టైలిష్ గా లాజికల్ గా సినిమాలను తెరకెక్కించడంలో సుకుమార్ సిద్ధహస్తుడు కావడంతో “పుష్ప” ఎటువంటి మ్యాజిక్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండో భాగం సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం అవుట్ డోర్ లో చెయ్యాలని సుకుమార్ డిసైడ్ అయ్యారట.
Read More: Pushpa: “పుష్ప” తర్వాత దృష్టి మొత్తం ఆ స్క్రిప్ట్ పై పెట్టిన బన్నీ..!!
ఈ నేపథ్యంలో చైనా దేశంలో ఉండే అడవి ప్రాంతాల్లో షూటింగ్ జరపాలని సుకుమార్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా రిజల్ట్ మొదటి భాగం బట్టి ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఇలా ఉంటే ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో బన్నీ అభిమానులు అసలు చైనా దేశానికి వద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు. వేరే చోట షూటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది.. అనవసరంగా అక్కడ రిస్క్ ఎందుకని, మహమ్మారి కరోనా పుట్టినిల్లు లో అంత పని చేయొద్దు .. అంటూ సుకుమార్ ని వేడుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!