Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు ప్రముఖ హీరోలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత తరం కాకుండా అంతకు ముందు సీనియర్ హీరోలలో చాలా అరుదుగా సోషల్ మీడియా ని వాడుతూ ఉంటారు. కానీ చాలా వరకు అభిమానులకు తమ వ్యక్తిగత విషయాలు మరియు పని చేసే సినిమా విషయాల గురించి హీరోలు సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తూ ఉంటారు. తమపై మీడియాలో ఎలాంటి రూమర్లు వచ్చినా గాని ..సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే గత ఏడాది చిరంజీవి సోషల్ మీడియా లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి తన వ్యక్తిగత విషయాల గురించి అదేవిధంగా సినిమా విషయాల గురించి అభిమానులతో తన స్పందన తెలియజేస్తూ ఉన్నారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న అనేక విషయాలు కొన్ని సూచనలు ఇస్తూ మరోపక్క కరోనా టైంలో అనేక జాగ్రత్తలు కూడా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది.
అంతే కాకుండా ఏదైనా సినిమా రిలీజ్ అయినా దాన్ని విషయాలు గురించి తెలియజేస్తూ ప్రముఖులకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలుపుతారు. దీనిలో భాగంగానే గత ఏడాది అఖిరా నందన్, అల్లు అర్జున్, అఖిల్ పుట్టిన రోజులు ఏప్రిల్ ఎనిమిదో తారీకు వచ్చిన సమయంలో చిరంజీవి ముగ్గురికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
కానీ ఈ ఏడాది మాత్రం బన్నీ, అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి అఖిరానంద్ నీ మర్చి పోవడం తో .. పవన్ అభిమానులు నిరుత్సాహం చెందారు. బన్నీ “పుష్ప” సినిమా టీజర్ గురించి తమ స్పందన తెలియజేస్తూ బర్త్డే విషెస్ తెలియజేశారు చిరంజీవి. అదేవిధంగా అఖిల్ కి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కొడుకు అకీరా నందన్ నీ చిరంజీవి మర్చిపోవటం పట్ల మెగా అభిమానులు కొంత నిరుత్సాహం చెందారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!