తెలుగు సినిమాలో చిరంజీవి మేనియా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర నటులు సినీ పరిశ్రమను ఏలుతున్న తరుణంలో పరిశ్రమలోకి వచ్చారు చిరు. బ్రేక్ డ్యాన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తొలుత సుప్రీం హీరోగా, ఆ తర్వాత మెగాస్టార్గా ప్రేక్షకుల నుంచి నీరాజనాలందుకున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్లో మల్టీస్టారర్ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే అగ్రహీరోలకు తగిన కథలను దర్శకులు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఇటీవల ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి, మహేష్ బాబుతో త్వరలో సినిమా రానుందని సమాచారం. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
60 ఏళ్ల వయసు దాటినా చిరులో ఏ మాత్రం హుషారు తగ్గలేదు. కుర్ర హీరోలకు ధీటుగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరో వైపు 40 ఏళ్లు దాటినా ఇంకా 20 ఏళ్ల వయసులోనే మహేష్ బాబు ఆగిపోయాడు. వయసు పెరిగే కొద్దీ ఇంకా కుర్రాడిగా తయారవుతున్నాడు. ఇది కేవలం మహేష్ బాబుకే సాధ్యం. ఇక మహేష్ బాబుకు ఫ్యాన్స్ బాగా ఎక్కువ. ఆయనకు క్లాస్, మాస్ రెండు రకాల ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరి క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ 15 ఏళ్ల క్రితమే ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని భావించాడు. ఎందుకో గానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది.
ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరు-రవితేజ కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేస్తారు. అయితే అన్నీ కుదిరితే ఆలోపే వందేమాతరం పేరుతో కృష్ణ వంశీ దర్శకుడిగా చిరు-మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రానున్నట్ల సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!