Chiranjeevi: బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా “బ్రహ్మస్త్ర”. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9వ తారీకు విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగు లో భారీ లెవెల్ లో విడుదల కానుంది. మొన్ననే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఆ సమయంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా “బ్రహ్మాస్త్ర” ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రేమకథా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది ఇట్లు ఫస్ట్ 20 నిమిషాలు తాను చూసినట్లు సినిమా చాలా అద్భుతంగా ఉందని రాజమౌళి తెలియజేశారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్ర సినిమాకి సంబంధించి .. తెలుగు ట్రైలర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలియజేశారు. మూడు భాగాలు గా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం..సెప్టెంబర్ 9వ తారీకు విడుదల కానుంది. ఒక నాగార్జున మాత్రమే కాదు సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా నటించడం జరిగింది.
ఈ వారంలో బాలీవుడ్ మొదలుకొని సౌత్ వరకు ప్రధాన భాషలలో “బ్రహ్మాస్త్ర” భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు భారీ ఎత్తున అక్కడి సినిమాలకు పోటీ ఇస్తూ ఉండటంతో బాలీవుడ్ మేకర్స్ సౌత్ వాళ్ళతో పని చేయడానికి కొద్దికొద్దిగా సౌత్ కి వస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి తీసిన “బాహుబలి 2”, “RRR” రెండూ కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించడంతో.. తెలుగు వాళ్ళతో పని చేయడానికి బాలీవుడ్ బడా బడా నిర్మాణ సంస్థలు.. టాప్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు నిదర్శనమే “బ్రహ్మాస్త్ర”లో నాగార్జున ఉండటంతోపాటు.. సినిమా ట్రైలర్ కి చిరంజీవి వాయిస్ ఇవ్వటం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!