Devatha Serial: రాధ నీలో ఏదో మార్పు వచ్చింది.. దేని గురించో నువ్వు బాగా ఆలోచిస్తున్నావు అని మాధవ్ అంటాడు.. లేదు నేను ఎప్పుడూ ఉండే లాగా ఉన్నాను.. మేమంతా నీతో సొంత మనిషిలా ఉన్నా.. మాలో ఎవరికీ చెప్పకుండా నీలో నువ్వే దేని గురించో బాధపడుతూ మాఅందరికీ దూరంగా ఉంటున్నావు.. నీ మనస్సులో ఎలాంటి సమస్య ఉన్నా.. బాధ ఉన్నా నిరభ్యంతరంగా నాకు చెప్పచ్చు అని మాధవ్ చెబుతాడు..!!
దేవి హోలీ ఆడుతుండగా ఆదిత్య సైలెంట్ గా వచ్చి.. దేవిని ఎత్తుకుని ముద్దులు పెడతాడు. ఎవరు ఎవరు అని అడిగితే.. ఆదిత్య మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక దేవి నాయనా నాయనా అని పిలిచి.. ఎవరో నన్ను ఎత్తుకుని ముద్దులు పెట్టారు.. అదిగో అతనే అని చూపిస్తుంది. ఆ హోలీ రంగుల్లో ఎవరో అర్థం కాక చూస్తూ ఉంటాడు మాధవ్. ఇక కోపం వచ్చిన మాధవ్ పక్కనే నీళ్ల డ్రమ్ము ఉంటే అందరి మీద నీళ్ళు కొడతాడు. అలా నీళ్లు కొడుతుండగా ఆ రంగులు పోయే ఆదిత్య కనిపిస్తాడు. మాధవ్ కోపంతో ఆదిత్య మీద అరుస్తాడు. నా పిల్లలను కిడ్నాప్ చేయడానికి ఇక్కడికి వచ్చావా.. నా పిల్లలు నిన్ను కలవడానికి ఇష్టం లేకపోతే ఎందుకు పదేపదే వచ్చి వాళ్ళని విసిగిస్తావు అని ఆదిత్యను చెడామడా తిడతాడు.
ఇక దేవి కూడా ఇప్పుడు దాకా సంతోషంగా ఆడుకున్నం. నువ్వు వచ్చి ఆట మొత్తం కరాబ్ చేసావు అని అంటుంది. మాధవ్ కోపంతో ఆడుకున్నది చాలు ఇక్కడినుంచి వెళ్దాం పదండి అని అంటాడు. దాంతో అందరూ ఇంటికి బయలు దేరుతారు. మాధవ్ కార్లో వెళ్తూ ఉండగా రాధ ఎక్కడ అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. వెనుకల కారులో వస్తుందేమో అని అంటుంది. ఆ కారులో చూడగా అందులో రాధ కనిపించదు. ఇక వెంటనే వాళ్ళ రాధ కోసం వెనక్కి బయలుదేరుతాడు మాధవ్. అంతలో రాధ ఏంది పెనిమిటీ బిడ్డ కోసం ఇలా బాధపడతున్నావు.. ఎందుకు తనని కలవడం కోసం వస్తున్నావు. చూడు అందరి ముందు నిన్ను ఎలా పలచన చేశారు అని రాధా మాట్లాడుతూ అంటుంది. వెనక్కి తిరిగి వచ్చిన మాధవ్ రాధ ఆదిత్య తో మాట్లాడటం చూసి ఎలా రియాక్ట్ అవుతాడో రేపటి ఒకసారి తెలుసుకుందాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!