Devatha Serial: రాధా దేవి ని తీసుకుని పొలం వైపు నుంచి నడుచుకుంటూ వస్తుంది.. అటువైపుగా భాగ్యమ్మ కూడా వస్తుంది.. దేవి భాగ్యమ్మను చూసి అమ్ముమ్మ అని పిలుస్తుంది. నిన్ను ఇలా పిలవటం నీకు ఇష్టమేనా అని కూడా అంటుంది దేవి.. తప్పకుండా అలాగే పిలువు అని అంటుంది భాగ్యమ్మ.. రాధ కు అట్టనే పిలవమని అంటుంది.. భాగ్యమ్మ రుక్కావ్వ అక్కడ నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది.. భాగ్యమ్మకు మాధవ్ ఏం చేస్తున్నాడో వివరంగా చెబుతుంది రాధ..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆదిత్య సత్యను నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అక్క దగ్గరకు వెళ్లాను అని అంటుంది. రాధే రుక్మిణి అన్న విషయం నీకు తెలుసు కదా అని అంటాడు ఆదిత్య. రుక్మిణినే రాధ అని నీకు తెలుసంటే.. నీకు కూడా తను రుక్మిణి అని తెలిసి నాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు అని అంటుంది సత్య.. నువ్వు ఎందుకు చెప్పలేదో నేను అందుకే చెప్పలేకపోయాను అని ఆదిత్య అంటాడు.. ఆదిత్య అక్క బ్రతికే ఉంది అని ఆంటీకి చెబుదామా అని అంటుంది సత్య. వద్దు అమ్మకు తెలిస్తే సంతోషిస్తుంది . కానీ తను ఒకరి భార్య అని తెలిస్తే ఇంకా బాధపడుతుంది.. ఈ విషయాన్ని అమ్మకు తెలియకుండా జాగ్రత్తగా ఉంచాలి అని అనుకుంటారు.
జానకమ్మ ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. అది చూసిన రాధా మీరు ఎందుకు పని చేస్తున్నారు. నేను చేస్తాను అని అంటుంది. ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోతుంది. రేపటి నుంచి కొత్త కోడలు వస్తుంది అని కొత్త దారి చూపించావుగా.. తను చేస్తుందో లేదంటే మాచేత చేయిస్తుందో ఎవరికి తెలుసు అని గట్టిగా సమాధానం చెబుతుంది జానకమ్మ.. ఇంతకాలం ఆశలు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి.. నువ్వు తేల్చిచెప్పావు కదమ్మా అని అంటుంది జానకమ్మ..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!