మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సినిమా నిర్మాతలు ఒప్పుకున్న ప్రాజెక్టులు ఎలా కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో పడిపోయారు. అసలు సినిమా ధియేటర్ లు ఓపెన్ అవుతాయో లేదో అనే సందిగ్ధంలో భవిష్యత్తు గురించి తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఏ మాత్రం భయపడకుండా భవిష్యత్ ప్రాజెక్టులను ఒక్కొక్కటి ఓకే చేస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో వివాహం చేసుకున్న దిల్ రాజు ఏడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
కరోనా వైరస్ వల్ల సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు దారుణంగా ఉన్న టైంలో తన నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మించడానికి దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో సిద్ధార్థ మల్హోత్రా ని హీరోగా పెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ తో కలసి నిర్మించడానికి దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ భయంకరంగా దేశంలో ఉన్న, రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి అటు ఇటుగా వున్న ఇలాంటి తరుణంలో వాటిని పట్టించుకోకుండా దిల్ రాజు బాలీవుడ్ ఇండస్ట్రీ లో ‘డిజె’ సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజ్ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత అని కామెంట్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!