ఈ లాక్ డౌన్ సమయంలో సినీ ప్రముఖులం సమయం దొరికింది కదా అన్నట్లు వరుసబెట్టి వివాహాలు చేసేసుకుంటున్నారు. ముందు హీరో నితిన్ తన ఎంగేజ్మెంట్ చేసుకోగా తర్వాత ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రానా దగ్గుబాటి కూడా లవ్ ఆఫ్ లైఫ్ ను జీవితం లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే లిస్ట్ లో చేరాడు యువ దర్శకుడు సుజిత్.
తీసింది రెండు సినిమాలే అయినా సుజిత్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తన మొదటి చిత్రం ‘రన్ రాజా రన్’ సెన్సేషనల్ హిట్. తర్వాత చిత్రం ప్రభాస్ తో భారీ బడ్జెట్ సాహో. తెలుగులో సరిగ్గా ఆడకపోయినా హిందీలో మాత్రం ఈ చిత్రం భారీగా వసూళ్లు కొల్లగొట్టింది. అయితే కొద్ది రోజులుగా సుజిత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఒక ఫోటో తో అతని నిశ్చితార్థం కూడా అయిపోయినట్లు తెలుస్తోంది.
నిన్న రాత్రి సుముహూర్తాన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుజిత్ రెడ్డి మరియు అతని ప్రియురాలు ప్రవళికల యొక్క నిశ్చితార్థం జరిగింది. ప్రవళిక ప్రొఫెషనల్ గా ఒక డెంటిస్ట్. ఇక ఈ నిశ్చితార్థానికి అడవి శేష్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిషోర్ వెళ్లారన్న వార్తలు వచ్చాయి. వారి ముగ్గురితో సుజిత్ కి చాలా మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం సుజిత్ ‘లూసిఫర్’ తెలుగు రిమేక్ యొక్క స్క్రిప్టు పైన కసరత్తు చేస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!