“బాహుబలి” సినిమా విజయం తో ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తన పాపులారిటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దక్కించుకున్నాడు. దేశంలో ప్రస్తుతం పర్ఫెక్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ ఓ వెలుగు వెలుగుతున్న డు. ప్రభాస్ తో సినిమా చేస్తే కనీసం నాలుగైదు భాషల్లో మార్కెట్ వుంటుంది. అందుకే ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్న మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ప్లాన్స్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం “రాధేశ్యామ్” సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఆ తరువాత ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుస్”, నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులతో పాటు మేకర్స్ లో కూడా ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంది. “మహానటి” సినిమాతో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ తో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ కాదు పాన్ వరల్డ్ లెవెల్ అని మరింత హైప్ సినిమాపై తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో నాగ్ అశ్విన్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. కానీ అభిమానుల లోనే టెన్షన్ మొదలైంది.
కారణం చూస్తే కేవలం రెండు సినిమాల అనుభవం అది కూడా పెద్ద పెద్ద స్టార్స్ ని డీల్ చేసిన అనుభవం లేని నాగ్ బాహుబలి సినిమా తో అదిరిపోయే హిట్ అందుకని మంచి పాపులారిటీ ఉన్న ప్రభాస్ నీ ఎలా డీల్ చేస్తారో అన్న టెన్షన్ నెలకొంది. అదేవిధంగా ఓం రౌత్ ఇదే టెన్షన్ పట్టుకున్నట్లు టాక్. అదే విధంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్, ప్రభాస్ చివరి సినిమా సాహో తీసిన డైరెక్టర్లకు పెద్దగా అనుభవం లేని పరిస్థితి. “రన్ రాజా రన్” అనే సినిమా మాత్రమే తీసి తర్వాత ప్రభాస్ తో “సాహో” అనే సినిమాని తెరకెక్కించిన సుజిత్ దారుణమైన అట్టర్ఫ్లాప్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా “రాధేశ్యాం” డైరెక్టర్ రాధాకృష్ణ గతంలో గోపి చందు తో “జిల్” అనే సినిమా చేసి ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్నారు ఈ సినిమాపై కూడా అభిమానుల లో రిజల్ట్ విషయంలో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఇలా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్లతో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేయటం అభిమానులలో తెగ టెన్షన్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!