యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఛలో సినిమా డెరెక్టర్ వెంకీ కుడుములతో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. నితిన్ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా డబ్బులు వసూలు చేస్తున్నారట. సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేసే కొంతమంది దీనిని నమ్మి వారికి డబ్బులు కూడా ఇచ్చి మోసపోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని ఈ విషయం చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకి తెలియడంతో, దీనిపై స్పందించిన వెంకీ నితిన్ తో కలిసి చేస్తోన్న సినిమాలో అవకాశం ఇస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు.
ఆ వాట్సాప్ గ్రూప్ తో కానీ డబ్బులు తీసుకోని మోసం చేస్తున్న వారితో కానీ చిత్రబృందానికి ఎలాంటి సంబంధం లేదని, డబ్బులు కట్టి మోసపోవద్దని క్లారిటీ ఇచ్చిన వెంకీ కుడుముల, భీష్మ సినిమాలో కొత్తవారికి అవకాశాలు ఉంటే స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని తెలిపారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోద్దని వెంకీ కుడుముల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మికనే భీష్మలో కూడా నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!