Ghantasala Shathajayanti: అమర గాయకుడు, గానగంధర్వుడు ఘంటసాల గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది.. ఘంటసాల వెంకటేశ్వర రావు 1922 డిసెంబర్ 4 న జన్మించారు. నేటితో ఆయన జన్మించి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ అమలాపురంలో చేయనున్నారు. ఈ విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి వడ్డాయార్ రూపుదిద్దారు.. అందరికీ గాయకుడిగా, సంగీత దర్శకుడుగా సుపరిచితమైన ఘంటసాల వెంకటేశ్వరరావు స్వాతంత్ర సమరయోధుడని మీకు తెలుసా.!?
ఘంటసాల వెంకటేశ్వరరావు 1942లో స్వర్గసీమ సినిమా లో ఓహో నా రాజా అంటూ పాడిన పాటతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన పాడిన మొట్టమొదటి పాటకి 116 రూపాయల పారితోషకం అందుకున్నారు. అదే సంవత్సరం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుండగా.. ఆ ఉద్యమంలో ఘంటసాల కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన దేశభక్తిని చాటుకున్నారు. అంతేకాదు అయినా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఘంటసాల ఇంటి పేరు ఉన్న 13 మంది పాల్గొన్నారు.
ఘంటసాల సినీ పాటలనే కాకుండా దేశభక్తి పాటలు కూడా ఆలపించారు. పాడవోయి భారతీయుడా అంటూ ప్రజల మధ్యలో దేశభక్తిని నింపారు. ఎన్నో దేశభక్తి గీతాలను ఆయన ఆలపించి తనకు ఉన్న దేశభక్తిని చాటి చెప్పారు. నేడు ఘంటసాల శత జయంతి దినోత్సవం. ఘంటసాల పాటలు వింటూనే ఘంటసాల విగ్రహం తయారు చేశానని శిల్ప వడయర్ చెబుతుండడం విశేషం. ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎర్ర వంతెన వద్ద ఎన్టీఆర్ మార్క్ లో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు నటుడు ఎల్బీ శ్రీరామ్ హాజరుకానున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘంటసాల సత జయంతిని పురస్కరించుకుని జిల్లాలో మొట్టమొదటిసారిగా ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!