Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాల మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉండాలని మహేష్ బాబు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళితో కూడా మహేష్ సినిమా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ రాజమౌళి గత ఏడాది లాక్ డౌన్ సమయంలో తెలిపారు.
పరిస్థితి ఇలా ఉండగా ఎప్పటి నుండో మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ త్రివిక్రమ్ సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు మే 31 వ తారీకు అధికారికంగా ప్రకటించడం జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ తో మహేష్ చేయబోయే సినిమా ప్రాజెక్టు అధికారిక ప్రకటన నేడు వచ్చే అవకాశం ఉన్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లో వైరల్ అవుతుంది.
ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో మహేష్ అభిమానులు నిజమేనా అంటూ తెగ డిస్కషన్లు చేసుకుంటున్నా పరిస్థితి. గతంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లోనే ఈ రెండు సినిమాలు ఓ మైలురాయి అని చెప్పవచ్చు. మహేష్ లో ఉన్న నటన సరికొత్తగా చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారు. ఇటువంటి తరుణంలో వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్నట్లు తాజా వార్త రావడంతో .. మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!