Balakrishna: ఇండస్ట్రీలో మంచి జోరుమీద ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని. తాజాగా రవితేజ తో “క్రాక్” సినిమా తీసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. త్వరలో నటసింహం నందమూరి బాలయ్య బాబు తో సినిమా చేయడానికి గోపీచంద్ మలినేని రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని గతంలో ఎన్నడూ చూడని విధంగా బాలయ్య బాబుని ఈ సినిమాలో చూపించాలని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తన సూపర్ డూపర్ హిట్ సెంటిమెంట్ హీరోయిన్ శృతి హాసన్ ని తీసుకోవాలని ఇప్పటికే డైరెక్టర్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు రావడం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే మరో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కి సీనియర్ హీరోయిన్ చెన్నై బ్యూటీ త్రిష ని తీసుకోవటానికి బాలయ్య బాబు పక్కన నటింపజేయడానికి డైరెక్టర్ రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే త్రిషకి స్టోరీ వినిపించినట్లు ఆమె కూడా ఓకే అన్నట్టు త్వరలో అఫీషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
గతంలో 2015 సంవత్సరంలో త్రిష.. బాలయ్య బాబుతో “లయన్” సినిమా చేయడం జరిగింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్గా మారింది. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి తో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ప్రజెంట్ సినిమా ధియేటర్ లో ఓపెన్ చేయలేని పరిస్థితి ఏర్పడటంతో.. పరిస్థితులు సద్దుమణిగాక అఖండ రిలీజ్ కానుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు అఖండ తో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!