అడవి శేష్ హీరోగా ఇటీవల “మేజర్” సినిమా రావడం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముంబై 26/11 దాడుల నేపథ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని.. దేశ జవాన్ కుటుంబాల భావోద్వేగాలు… దేశం కోసం నమ్మకంగా పనిచేసే సైనికుడు రెండు ఫీలింగ్స్ తెరపై చూపిస్తూ.. మధ్యలో కొద్దిపాటి లవ్ స్టోరీ అటాచ్ చేసి “మేజర్” మూవీ దేశ ప్రజల మేచ్చేమూవీ గా దర్శకుడు శశికిరణ్ అద్భుతంగా తెరకెక్కించాడు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు “మేజర్” సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సమయంలో మేజర్ సందీప్ కుటుంబ సభ్యులను కూడా పొగడటం జరిగింది.
ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం.. “మేజర్” సినిమా యూనిట్ నీ ప్రశంసించడంతోపాటు మేజర్ సందీప్ కుటుంబానికి సహాయం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలలో నెంబర్ వన్ స్థానంలో అత్యధిక వ్యూస్ సాధిస్తున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో మేజర్ సందీప్ భారత సరిహద్దులలో డ్యూటీ చేస్తున్న టైంలో చేసిన చిన్న చిలిపి పని గురించి కొత్త విషయాన్ని అడవి శేష్ తెలియజేశారు.
విషయంలోకి వెళ్తే భారత సరిహద్దులలో మేజర్ సందీప్ ని కృష్ణన్ విధులు నిర్వహిస్తున్న టైములో… పాకిస్తాన్ దేశానికి చెందిన సిగ్నల్స్ వచ్చేయట. ఆ టైంలో పాకిస్తాన్ రేడియో వాళ్ళు మన ఇండియాకి చెందిన బాలీవుడ్ సాంగ్స్ ప్లే చేసేవారట. ఈ క్రమంలో సందీప్ ఆ పాకిస్తాన్ రేడియో స్టేషన్ కి ఫోన్ చేసి .. నేను ఇండియన్ సోల్జర్ ని .. అని చెప్పుకుని తనకి నచ్చే బాలీవుడ్ సాంగ్ ప్లే చేయమని.. అడిగేవారట. ఈ సీన్ సినిమాలో పెడదామని భావించాం కానీ కుదరలేదు అంటూ.. కొత్త విషయాన్ని అడవి శేషు బయటపెట్టారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!