సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఫస్ట్ సూపర్ హిట్ సినిమా “ఒక్కడు” అని అందరికీ తెలుసు. ఈ సినిమా విజయంతో మహేష్ కి ఇండస్ట్రీలో స్టార్ డమ్ రావడం జరిగింది. కాగా 2003వ సంవత్సరం జనవరి 15వ తారీఖున రిలీజ్ అయి ఇప్పటికీ 18 సంవత్సరాలు కావటంతో.. మహేష్ భార్య నమ్రత ఒక్కడు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
డైరెక్టర్ తో పాటు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలపడమే కాక ఒక్కడు సినిమా తన ఫేవరేట్, మహేష్ క్లాసికల్ సినిమా అంటూ చెప్పుకోచ్చింది. ఈ తరుణంలో నిర్మాత ఎం.ఎస్.రాజు పేరు ప్రస్తావించడం నమ్రత మర్చిపోవడం తో ఈ విషయాన్ని గ్రహించిన ఎమ్మెస్ రాజు.. పొరపాట్లు జరుగుతాయి అయినా పర్వాలేదు, నేను నిర్మించిన ఒక్కడు సినిమాని క్లాసికల్ మూవీగా ఆమె అభివర్ణించడం అదే సంతోషం అని చెప్పుకొచ్చారు.
దీంతో ఈ విషయాన్ని గ్రహించిన నమ్రత.. వెంటనే తన తాజా ఇంస్టాగ్రామ్ పోస్టులో ఎమ్మెస్ రాజు పేరు పెట్టడం జరిగింది. దీంతో ఇది పెద్ద వైరల్ కాకుండా.. గొడవ జరగకుండా పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ దుబాయ్ లో స్టార్ట్ కానుందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!