Radhe shyam: సంక్రాంతి బరిలో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మహేశ్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్, రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ కోసం మహేశ్ సర్కారు వారి పాట, పవన్-రానాల భీమ్లా నాయక్ పోస్ట్పోన్ చేశారు. ఇక బరిలో నిలిచింది ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు మాత్రమే. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలదే సంక్రాంతి సందడంతా అని రికార్డుల వేట వీటిదే అనుకున్నారు.
కానీ, ఒమైక్రాన్ దెబ్బతో మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దాంతో ముంబై, ఢిల్లీ సహా మిగతా ప్రాంతాలలోనూ చాలా వరకు నైట్ కర్ఫ్యూతో పాటు అన్నీ మూసివేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రోజు రోజుకూ వేగంగా విజృంభిస్తున్న కారణంగా థియేటర్స్ మళ్ళీ మూతపడనున్నాయి. దాంతో తప్పని పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.
Radhe shyam: రాధే శ్యామ్మ్ సినిమాను రిలీజ్ చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని విశ్లేషకులు అభిప్రాయం
దాంతో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ కు సోలో డేట్ దొరికింది. చిత్రయూనిట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సినిమాను ప్రకటించిన దాని ప్రకారం జనవరి 14న విడుదల చేయబోతున్నామని మరోసారి మేకర్స్ కన్ఫర్మ్ చేసింది. ఇది ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ వైరస్ కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సినిమాను రిలీజ్ చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టికెట్ ఇష్యూ ఒకటి ఉంది. ఇప్పుడు కరోనా వైరస్..అన్నీ కలిసి రాధే శ్యామ్ సినిమాకు మైనస్గా మారతాయని అంటున్నారు. మరోవైపు చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవుతుందని ఓ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ థియేటర్స్ రిలీజ్ కుదరకపోతే ఓటీటీలోనైనా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!