పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”, నాగ ఆశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా.. ఇలా మూడు సినిమాల షూటింగ్ లలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇలా ఉంటే ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “మిర్చి” సినిమా డైరెక్టర్ కొరటాలతో ప్రభాస్ సినిమా షురూ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా 2025లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొరటాల శివకి ఇటీవల ప్రభాస్ మాట ఇచ్చినట్లు దాంతో స్క్రిప్ట్.. ఆ టయానికి రెడీ చేయడానికి కొరటాల డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా. అయితే “ఆచార్య” అట్టర్ ప్లాప్ అవడంతో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ అన్ని విషయాలలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
“ఆచార్య” సినిమా రాకముందు వరుస బ్లాక్ బస్టర్ లతో.. ఒక్క పరాజయం లేని డైరెక్టర్ గా కొరటాల శివ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆచార్య పరాజయం పాలు కావడంతో ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో మరోసారి సత్తా చాటాలని చాలా కసిగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మిర్చి తీసిన టైంలో కేవలం టాలీవుడ్ లోనే ప్రభాస్ కి మార్కెట్ ఉంది. బాహుబలి 2 దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రెడిట్ అయి ఉండటంతో ప్రభాస్ కోసం కొరటాల పాన్ ఇండియా స్టోరీ రాసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!