Pawan kalyan: మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాలీడ్ హిట్ అందుకున్నారు. ఇక రీసెంట్గా మాస్ ఎంటర్టైనర్ ‘భీమ్లానాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందు కొచ్చి మరో సాలీడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మలయాళ సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఆధారంగా ఇక్కడ ‘భీమ్లానాయక్’ చిత్రాన్నిరీమేక్ చేశారు. ఈ రెండు రీమేక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న పవన్ మరో రెండు సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
వాటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు. ఈ సినిమాను పీరియాడికల్ బ్యాక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత ఏం ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అవగా, ప్రస్తుతం మిగతా షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ వచ్చి భారీ అంచనాలను పెంచేసింది.
Pawan kalyan: సినిమాలు కొంతకాలం బ్రేక్ ఇస్తున్నారట.
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇలాంటి సినిమాను చేయలేదు. అందుకే పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఇదే క్రమంలో పవన్ చేయాల్సిన మరో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందాల్సిన భవధీయుడు భగత్సింగ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చేయాల్సిన సినిమా ఒకటి. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలకు పవన్ బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది.
రాజకీయాలలో మళ్ళీ బిజీ కాబోతున్న నేపథ్యంలో హారీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాలు కొంతకాలం బ్రేక్ ఇస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమోగానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మేకర్స్ నుంచి వస్తేగానీ నమ్మలేము. ఇక పవన్ తమిళ హిట్ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మరో టాక్ మొదలైంది. సొంత నిర్మాణ సంస్థలో మేనల్లుడు సాయి ధరం తేజ్తో ఈ సినిమాను నిర్మిస్తారని..పవన్ కూడా కీలక పాత్ర పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!