Janhvi Kapoor: అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రంతో జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఏ మాత్రం నిజంలో లేదని జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పష్టం చేశారు.
అయితే శ్రీదేవి కూతురు ఎంట్రీ అక్కినేని అఖిల్ మూవీతో అని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్తో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.
అయితే ఈ సినిమాలో అఖిల్కు జోడీగా జాన్వీ కపూర్ను ఎంపిక్ చేశారట. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆ ఆనౌన్స్మెంట్ రావాల్సిందే.
కాగా, అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 12న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాపై సైతం భారీ అంచనాలే ఉన్నాయి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!