Rajamouli – Prabhas: అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సత్తా ఏంటో..చూపించేవి. ఆ సినిమాలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమాను జనవరి 7న రిలీజ్ చేయాలని ఎంతో తాపత్రయంగా నెలరోజులకు పైగా ప్రమోషన్స్ నిర్వహించారు. చివరికి కరోనా థర్డ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేసి అందరినీ తీవ్రంగా నిరాశపరచారు.
ఇక ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ రొమాంటిక్ సినిమా రాధే శ్యామ్ కూడా అత్యంత భారీ స్థాయిలో 7 భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే సంకేతాలు వచ్చాయి. అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పోన్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేశారు. చివరికి ఓటీటీలో చూసేందుకు కూడా సిద్దమని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ పెట్టారు. కానీ, పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపించలేదు.
Rajamouli – Prabhas: ప్రభాస్ను రాజమౌళి రిక్వెస్ట్ చేసి మార్చ్ 17 తేదీని ఆర్ఆర్ఆర్కు అడుగుతున్నారట..!
ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేసిన సరిగ్గా వారం రోజులకు రాధే శ్యామ్ సినిమాను రిలీజ్ చేయాల్సింది. పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే ప్రయత్నాలలో మేకర్స్ ఉండగా అదే డేట్కు ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తోందట. సంక్రాంతి బరి నుంచి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ను రాజమౌళి రిక్వెస్ట్ చేసి మార్చ్ 17 తేదీని ఆర్ఆర్ఆర్కు ఇవ్వమని అడుగుతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక దీనిని బట్టి చూస్తే మార్చ్ 17న ఈ రెండు సినిమాలలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!