Janhvi Kapoor: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ ఎంట్రీ ఆ హీరో మూవీతో కన్ఫామ్ అయిందని, ఈ హీరో మూవీతో కన్ఫామ్ అయిందని ఎన్నెన్నో ప్రచారాలు జరిగాయి. మొన్నటి వరకు `ఎన్టీఆర్ 30`తో జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోందని వార్తలు రాగా.. ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూ వాటిని ఖండించారు.
ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించబోయే పాన్ ఇండియా చిత్రం `జనగణమన`లో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ ఎంపిక్ అయిందని.. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోందనే ప్రచారం ఊపందుకుంది. దేశభక్తి నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నాడు. దాదాపు 80 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఆమెనే స్వయంగా నోరు విప్పింది.
ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. `పుకార్లను నమ్మకండి. నేనిప్పటి వరకు ఏ తెలుగు సినిమా కానీ, తమిళ సినిమా కానీ ఓకే చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమాకు సైన్ చేస్తే..నేను కానీ, నా ప్రొడక్షన్ హౌజ్ కానీ ఆ విషయాన్ని ప్రకటిస్తుంది.` అని పేర్కొంది. దాంతో విజయ్ మూవీతో జాన్వీ ఎంట్రీ అన్న ప్రచారం పుకారే అని తేలిపోవడంతో.. ఇక్కడున్న ఆమె ఫ్యాన్స్ బాగా హట్టైయ్యారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!