మహేష్ `మహర్షి` చిత్రంతో మే 9న సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 25వ చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా .. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. రీసెంట్గా డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 11 కోట్ల రూపాయలకు దక్కించుకుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా.. తాజాగా `మహర్షి` శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలు వినపడుతున్నాయి. సమాచారం ప్రకారం ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని టీవీ 16.8 కోట్ల రూపాయలను చెల్లించి ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!