Garikapati Chiranjeevi: దసరా పండుగ తర్వాత సికింద్రాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదంగా మారడం తెలిసిందే. “అలయ్ బలయ్” కార్యక్రమా నిర్వాహకులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు చిరంజీవి హాజరయ్యారు. అయితే సరిగ్గా వేదికపై గరికపాటి ప్రసంగం చేస్తున్న సమయంలో చిరంజీవి వెళ్లడంతో ఒక్కసారిగా అభిమానులు.. ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.
దీంతో ప్రసంగిస్తున్న గరికపాటి అసహనానికి లోనయ్యారు. చిరంజీవి గారు వెంటనే ఫోటో సెషన్ ఆపేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫోటో సెషన్ ఆపేయకపోతే నేను ఈ కార్యక్రమం నుండి వెళ్ళిపోతానని మైక్ లోనే అన్నారు. ఒక్కసారిగా అందరి ముందు గరికపాటి అందరూ చూస్తుండగానే మైక్ లోనే చిరంజీవిపై ఈరకంగా ఘాటుగా రియాక్ట్ కావడంతో పెద్ద వివాదాస్పదంగా మారింది. మెగా బ్రదర్ నాగబాబు.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంకా చిరంజీవిని అభిమానించే సన్నిహితులు..అభిమానులు గరికపాటిపై మండిపడ్డారు.
అయితే తాజాగా ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. గరికపాటి ఇంక చిరంజీవి వివాదం విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ చిరంజీవి గారితో ఫోటో తీసుకోవడం వాళ్ళ అభిమానులకు అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆయన ఒక లెజెండ్. కాబట్టి ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్లి మరీ ఫోటోలు తీసుకుంటారు. అది సాధారణమైన విషయమే. అభిమానుల అత్యుత్సాహాన్ని ఎవరు ఆపలేరు. అటువంటి పెద్ద స్టార్ హీరో వస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు చాలా ఆత్రుతగా ఉంటారు.. అంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!