కరోనా వైరస్ ప్రభావం తో దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమలు చాలావరకు నష్టపోయాయి. సరిగ్గా వేసవికాలం టైంలో భారీ సినిమాలు విడుదల కావాల్సిన తరుణంలో కరోనా వైరస్ రాకతో సినిమా ధియేటర్లు క్లోజ్ అవ్వటం జరిగింది. దీంతో భారీ చిత్రాలు సైతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఓటీటీ లో రిలీజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క సినిమా, సీరియల్ షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన గాని షూటింగ్ లు చేస్తున్న యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికీ ఈ చిత్ర పరిశ్రమలో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో సినీ ప్రియుల కోసం మోడీ సర్కార్ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరికొత్త ప్రామాణిక నిర్వహణ విధానం రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం గతంలో లాగా పుంజుకునే విధంగా ఫిలిం మేకింగ్ మరియు టీవీ సీరియల్, కో-ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ ఇలా అనేక రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని, ఈ రంగాల్లో ఉత్పాదకత పెంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు. త్వరలోనే వీటికి సంబంధించి విధివిధానాలు ప్రకటించబోతున్నట్లు ప్రకాష్ జవదేకర్ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఇండియాలో సినిమా షూటింగ్ ల కోసం ఇప్పటికే కొంతమంది విదేశీ నిర్మాతలు అనుమతులు కూడా పొందటం జరిగిందని సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. అదే విధంగా సినిమా షూటింగ్ ల విషయంలో కరోనా ఎఫెక్ట్ ఎవరకి అవ్వకుండా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సరైన రూపకల్పనతో ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!