Chiranjeevi Mohan Babu: తెలుగు చలనచిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య విభేదాలు ఎప్పటినుండో ఉన్న సందర్భాలు ఉన్నాయి. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు సమయంలో ఆ తర్వాత వజ్రోత్సవంలో చిరు పై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల నుండి… ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది అనే ప్రచారం మీడియాలో ఎప్పటినుండో జరుగుతున్నే ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో విభేదాలు గురించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ వెబ్ మీడియా యాంకర్ వజ్రోత్సవంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు గురించి ప్రశ్నించారు. దీనికి మోహన్ బాబు సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలొస్తాయి. నిజాలు ఏంటో అసత్యాలు ఏంటో ఎవరికి కూడా తెలియదు. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం. మళ్లీ ఇప్పుడు ఎందుకు దాని గురించి ప్రశ్నిస్తారు. ఇప్పుడు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాలలో స్నేహితుల మధ్య అన్నదమ్ముల మధ్య ఆత్మీయుల మధ్య కూడా చిన్నచిన్న మాటలు దొర్లుతుంటాయి. భారత రామాయణ భాగవతంలో కూడా ఇదే మనం చూశాం. కాబట్టి అది పెద్ద నథింగ్. ఆ విషయాలు వద్దు వేరే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ క్రమంలో మా ఎలక్షన్స్ జరిగిన సమయంలో ఇండస్ట్రీలో చిరంజీవి వర్గం వర్సెస్ మోహన్ బాబు వర్గమని విడిపోవడంపై యాంకర్ ప్రశ్నించారు.
దీనికి మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అనేది ఒక చరిత్ర. మంచు విష్ణు విజయాన్ని అందుకున్నాడు. అదేవిధంగా మా ఎలక్షన్ సమయంలో విష్ణు చెప్పినవన్నీ చేశాడు. ఒక్క బిల్డింగ్ తప్ప మిగతా పనులు అద్భుతంగా చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ విషయంలో కొంత బాధ ఉంది. మా ఇద్దరి మధ్య కీచులాట అనేది భార్యాభర్తల మధ్య ఉన్నట్టే ఉంటుంది. అయితే ఆ బాధ ఇప్పటికీ తన మనసులో ఉందని అలా ఎందుకు జరిగింది అది తన తప్ప లేకపోతే చిరంజీవి తప్ప అనేది ఇప్పుడు చర్చించాల్సికోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చారు. మా ఎన్నికల తర్వాత 100 సార్లు ఇద్దరం ఎదురు పడ్డాం. ఇద్దరం కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని బయట వారు అనుకోవటమే తప్ప ఏమీ లేదని తేల్చి చెప్పారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!