Project k: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ -కె’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థలో ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రం. అంతేకాదు, టాలీవుడ్ నుంచి అగ్ర సంస్థగా పేరు సంపాదించుకోబోతోంది. ‘బాహుబలి’..’ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా ‘ప్రాజెక్ట్ -కె’ సినిమాను నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే సహా పలువురు టాప్ స్టార్లందరూ ఈ సినిమాలో కీలక పాత్రలను చేస్తున్నారు. ఇక విదేశీ టెక్నీషియన్లని కూడా ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దించుతున్నారు. ఇక ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కె మూవీలో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాని కూడా భాగం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆనంద్ మహీంద్రా సాయం కోరుతూ ఇటీవల చిత్ర దర్శకుడు నాగ్ ఆశ్విన్ ఇటీవల వరుస ట్వీట్లు చేశారు.
Project k: ప్రాజెక్ట్ k కోసం అంత పెద్ద వారిని దింపడం విశేషం.
తాజాగా చెన్నైలోని నాగ్ అశ్విన్.. వేలు మహీంద్రాతో సమావేశమయ్యారు. ఆయనతో చర్చలు జరిపి ప్రాజెక్ట్ కె సినిమాకు సంబంధించిన వివరాలు అందించారు. ఈ సందర్భంగా.. వేలు మహీంద్రతో కలిసి మహీంద్ర రీసోర్చ్ వ్యాలీని నాగ్ అశ్విన్ సందర్శించారు. ఈ సమయంలో నాగ్ అశ్విన్ ట్వీట్ చేసారు. ‘ఎంతో అందమైన క్యాంపస్. ఇక్కడ ప్రకృతి ఎంతో బాగుంది. ప్రకృతి సైతం అత్యాధునిక సాంకేతికతను అందుకుంటుంది. వేలు బృందంతో ప్రయాణం ఎంతో బాగుంది’. ఇలాంటి అవకాశం కల్పించిన ఆనంద్ మహీంద్ర సర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని అన్నారు. మొత్తం మీద మేకర్స్ ప్రాజెక్ట్ k కోసం అంత పెద్ద వారిని దింపడం విశేషం.