`ఛలో` లాంటి చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ని పూర్తిచేసుకుంది. జూన్లో రెండో షెడ్యూల్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యకి జంటగా మెహరీన్ నటిస్తుంది.
నిర్మాతలు మాట్లాడుతూ “`ఛలో` లాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని చాలా నిజాయతీగా నిర్మించాం. ప్రేక్షకులు అంతే నిజాయతీగా అఖండ విజయం అందించారు మా బ్యానర్లో చిత్రాలు అన్నీ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాం. `ఛలో` మంచి ప్రేమకథ, `నర్తనశాల` మంచి కామెడి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే విధంగా నాగశౌర్య నటించే ప్రోడక్షన్ నెం 3 చిత్రం షూటింగ్ మెదటి షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేశాం. నాగశౌర్య రాసిన కథకి దర్శకుడు రమణతేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థవంతంగా షూట్ చేస్తున్నాడు. మెహరిన్ హీరోయిన్ గా మరోక్కసారి ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది. తదుపరి షెడ్యూల్ ని జూన్ లో చేస్తాం“ అని అన్నారు
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!