నేడు ఎన్టీఆర్ 97వజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ను తారక్, కల్యాణ్ రామ్ అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఘాట్ ఎలాంటి అలంకరణ లేకుండా ఉండటంతో తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పువ్వలు తెప్పించి తారక్, కల్యాణ్ రామ్ స్వయంగా అలంకరించారు. భవిష్యత్లో ఎన్టీఆర్ జయంతి, లేక వర్ధంతి బాధ్యతలను ఇకపై తానే తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. తారక్, కల్యాణ్ రామ్ కాసేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చుని వెళ్లిపోయారు. తెలుగువాడి ఉనికిని తెలుగుదేశం పార్టీ ద్వారా చాటిన ఓ గొప్ప వ్యక్తి, మహానటుడు దివంగత నేత ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పార్టీ అధిష్టానం, కార్యకర్తలు పట్టించుకోకపోవడం బాధాకరం.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!