యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు మెగా క్యాంప్ అడ్డా అయిన గీతాఆర్ట్స్లో అడుగుపెడుతున్నాడు. గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ మినిమం బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యానర్తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తాడు. `కుమారి 21 ఎఫ్` దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. ఈ సినిమాకు నిర్మాతలుగా సుకుమార్, బన్నీవాస్లు వ్యవహరించనున్నారు. సుకుమార్ ఈ సినిమాకు కథ,స్క్రీన్ప్లే అందించనున్నాడు. త్వరలోనే సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!