Nithin: హీరో నితిన్ గత ఏడాది స్టార్టింగ్ లో “భీష్మ” సినిమా తో అదిరిపోయే విజయాన్ని అందుకుని లాక్డౌన్ టైంలో.. వివాహం చేసుకునే ఇంటివాడైన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత తాజాగా ఇటీవల తన కొత్త సినిమా “రంగ్ దే” విడుదల చేసి ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇదిలా ఉంటే త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినబడుతోంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో “హార్ట్ ఎటాక్” సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ మాదిరిగా పర్వాలేదనిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న పూరి జగన్నాథ్… 2019 వ సంవత్సరం లో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో సూపర్ హిట్ కొట్టడం తెలిసిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి “ఇస్మార్ట్ శంకర్” అదిరిపోయే విజయాన్ని కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా నిండా మునిగిపోయి ఫ్లాపుల్లో ఉన్న పూరి కి.. మళ్లీ తన మార్కెట్ తెచ్చి పెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే పూరి ఇండస్ట్రీలో దుకాణం సర్దే టైం అయింది, అన్న టైం లో “ఇస్మార్ట్ శంకర్” పూరి స్టామినా ఏంటో..డైరెక్షన్ దమ్మేంటో నిరూపించింది అని చెప్పవచ్చు..
ఈ సినిమా విజయం కావడంతో టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరూ పూరి ఇజ్ బ్యాక్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జరిగింది. మంచి ఫామ్ లో ఉన్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో “లైగర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే.. పూరి నితిన్ తో ఓ సరికొత్త స్టోరీ లైన్ లో సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!