దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ రావడంతో మెగా అభిమానులు ఆకలి మొత్తం తీర్చడానికి పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాని తెలుగులో “వకీల్ సాబ్” పేరిట రీమేక్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారు.
ఈ సినిమా అయిన వెంటనే పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక కథలను సరికొత్తగా తెరకెక్కిస్తే ఈ తరానికి ఎంతో ఇంట్రెస్ట్ కలిగించేలా సినిమాలు తీసే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించాలని క్రిష్ ఆలోచన చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మొఘలుల కాలం నాటి సినిమా కావటంతో.. గుర్రపు స్వారీ అదేవిధంగా ఫైట్లు హాలీవుడ్ రేంజ్ లో ఉండే తరహాలో సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దించే ఆలోచన సినిమా యూనిట్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాతో పాన్ ఇండియా లో తనకంటూ సరికొత్త మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి పవర్ స్టార్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా గాని మినిమమ్ 30 కోట్లు రాబట్టడం గ్యారెంటీ. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పాన్ ఇండియా తరహాలో సినిమాలు చేస్తున్న తరుణంలో.. పవన్ కూడా అదే తరహాలో రాణించాలని సరికొత్తగా క్రిష్ సినిమా తో హాలీవుడ్ స్థాయిలో ఫైట్లు ఉండే విధంగా చూసుకుంటూ పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!