Prabhas: ప్రభాస్తో సినిమా అంటే ఇంకా నమ్మడం లేదు..ఆ దర్శకుడికి అంత రేంజ్ లేదా..? ఇలాంటి కామెంట్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అంతేకాదు కొందరు నెటిజన్స్ కూడా ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ కొత్తగా సినిమా అంటే ఆయన అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా పెద్ద దర్శకుడే అని ఊహించుకుంటారు. కానీ, సాహో సినిమా నుంచి ప్రభాస్ తన స్టైల్ మార్చేశారు. టాలెంటెడ్ అనిపిస్తే ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. సాహో, ఇప్పుడు రాబోతున్న రాధే శ్యామ్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ విషయంలో ఇదే మాట్లాడుకున్నారు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తాడా అని సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలోనే స్పిరిట్ అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ అంటే ముందు ఎవరూ నమ్మలేదు. కానీ, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారు అధికారికంగా ప్రకటించగానే అందరూ షాకయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తాడనే ప్రచారం కూడా ఎక్కువ రోజులు జరగలేదు. ఈ కాంబినేషన్లో సలార్ సినిమాను సడన్ సర్ప్రైజ్గా అనౌన్స్ చేశారు. అలాంటిది ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నారనే ప్రచారం మొదలైంది.
Prabhas: పాన్ ఇండియా రేంజ్లో మారుతి కథ సిద్దం చేశాడా..?
చెప్పాలంటే మారుతీ చాలా సినిమాలే చేశాడు. ఆయన సినిమాలు మరీ డిజాస్టర్ అయినవి లేవు. అయితే, పాన్ ఇండియా స్టార్తో సినిమా అది కూడా ప్రభాస్తో అంటేనే ఇప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. రాజా డీలక్స్ అనే పేరుతో వీరు సినిమా చేయనున్నారని ఈ మధ్య వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అతి త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నారని తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మరి పాన్ ఇండియా రేంజ్లో మారుతి కథ సిద్దం చేశాడా ..ఈ ప్రాజెక్ట్ నిజమేనా అనేది ప్రకటన వస్తే గానీ నమ్మడానికి లేదు. ఇక ఇప్పుడైతే ప్రతీ ఒక్కరు రాధే శ్యామ్ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!