Prabhas-Pawan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. పవన్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో..? అసలేం జరిగిందో..? తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించగా.. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు.
`అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. అయితే షూటింగ్ మాత్రం ఈరోజే పూర్తి అయింది. రామోజీ ఫిలిం సిటీలో ఫైనల్ షెడ్యూల్ను ఫినిష్ చేసి పవన్ కల్యాణ్ అండ్ టీం ప్యాకప్ చెప్పేసింది.
అయితే భీమ్లా నాయక్ సెట్స్కు పక్కనే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ప్రాజెక్ట్-కె` చిత్రీకరణ జరుగుతోందట. ఈ విషయం తెలుసుకున్న పవన్.. `ప్రాజెక్టు కె` లొకేషన్ వెళ్లి ప్రభాస్కి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడట. అంతేకాదు, ప్రభాస్తో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందుకు సంబంధిన ఫొటోలు మాత్రం ఏవీ బయటకు రాలేదు.
ఇక ప్రాజెక్ట్-కె విషయానికి వస్తే.. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొననె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.