Radhey Shyam: దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” సినిమా రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో… విదేశాలలో.. దేశంలో… సందడి నెలకొంది. గురువారం సాయంత్రం ఉండే “రాదేశ్యమ్” థియేటర్ల వద్ద… డార్లింగ్ అభిమానులు సందడి చేశారు. భారీ కటౌట్లు కొట్టడంతో పాటు థియేటర్ బయట… బైకులతో స్టంట్ లు చేస్తూ పండగ చేసుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో.. ప్రభాస్ చాలా చురుగ్గా పాల్గొనడం తెలిసిందే. కాగా సినిమా విడుదలకు ఒక రోజు ముందు… రాధేశ్యామ్ గురించి రాజమౌళి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్రభాస్ పర్సనల్ లైఫ్ ఇంకా.. బాహుబలి తర్వాత వ్యక్తిత్వంలో మార్పు రావటం తో పాటు మీడియా ముందు ధైర్యంగా మాట్లాడటం ఇంకా చాలా విషయాలు గురించి ప్రభాస్ నీ రాజమౌళి అడిగి తెలుసుకున్నారు.
అయితే సినిమాలో ప్రభాస్ జాతకాలు చెప్పే వాడిగా… ప్రొఫెషనల్ పాత్ర చేయటంతో తాజాగా రాజమౌళి జాతకాల గురించి ప్రభాస్ నీ ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ప్రభాస్.. మాట్లాడుతూ వాస్తవానికి ఈ జీవితంలో నేను జాతకాలు పెద్దగా నమ్మను. నాతో పాటు మా గురువుగారు కూడా నమ్మరు అంటూ.. రాజమౌళి గురించి కూడా తెలియజేశారు. ఈ తరుణంలో ఏక్ నిరంజన్ సినిమా చేస్తున్నప్పుడు అందులోనూ నాతోపాటు నటించిన హీరోయిన్ కంగనా ఈ విషయంలో జాతకం నిజమైంది అని సరికొత్త విషయం ప్రభాస్ బయట పెట్టారు.
వాస్తవానికి కంగనా చిన్నప్పుడు గ్రామంలో ఉన్న టైంలో ఇంకా హీరోయిన్ కాకముందే కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ తాళపత్ర గ్రంథాలను చూసి… కంగనా హీరోయిన్ అవుతుందని అక్కడ వాళ్లు చెప్పటం జరిగిందట. అయితే ఆ సమయంలో కంగనా ఇంకా ఇంట్లో వాళ్ళు ఇలా చెబుతున్నారు అని… లైట్ తీసుకున్నారట. కానీ ప్రజెంట్ ఆమె ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ అయింది. 20 సంఘటనలు కొన్ని విన్నాము అంటూ ప్రభాస్ జాతకం గురించి తన స్పందన తెలియ జేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!