ఇటీవల నేషనల్ స్టార్, యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన `సాహో` విడుదలైంది. హిందీలో హిట్ అయిన ఈ సినిమా మిగిలిన చోట్ల నిరాశనే మిగిల్చింది. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే ఈ సినిమా కోసం ప్రభాస్ మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమా విడుదలైంది. దీంతో వెంటనే తదుపరి సినిమాలోకి దూకేయకుండా కాస్త రిలాక్స్ కావాలనుకున్నాడట. అందుకుని ఆయన పారిస్ వెళుతున్నాడట. ఈ వెకేషన్ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ప్రభాస్ పాల్గొంటాడట. పీరియాడికల్ లవ్స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!