Pushpa 2: పుష్ప: ది రైజ్ పార్ట్ 1 వచ్చి అనూహ్యంగా అత్యంత భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ మేకర్స్ కూడా ఊహించలేదు. అందుకే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ప్రకటించిన సినిమాల కంటే ముందు ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఫోకస్ పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సీక్వెల్ పుష్ప: ది రూల్ పార్ట్ 2 మీద పెట్టారట. అంతేకాదు, ఇప్పటి నుంచే ఓ రిలీజ్ డేట్ టార్గెట్గా పెట్టుకొని సినిమాను ఆ సమయానికి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు పక్కా ప్లాన్ పెట్టుకున్నట్టు తాజా సమాచారం. ఐకాన్ స్టార్ అనే క్రేజ్ తెచ్చి పెట్టిన సుకుమార్ ఈ సీక్వెల్ సినిమాను మొదటి భాగానికంటే నాలుగింతలు గ్రాండ్గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే తనకు అత్యంత సన్నిహితులైన రచయిత బృందానికి పుష్ప: ది రూల్ కథను నరేట్ చేసి వారిచ్చిన సలహాలను పరిశీలించి పార్ట్ 1 లో జరిగిన కొన్ని లోపాలను సరిచేసినట్టు తెలుస్తోంది. పుష్ప రాజ్గా బన్నీ పర్ఫార్మెన్స్ మొదటి భాగంలోనే పీక్స్ అంటే ఇప్పుడు తెరకెక్కనున్న పార్ట్ 2లో అంతకు మించి అనేలా ఓ సరికొత్త మేనరిజాన్ని బన్నీకి పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్లో కూడా హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తోంది. ఇటీవల ఫారిన్ ట్రిప్ ముగించుకొని వచ్చిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సిద్దమవుతున్నారు. ఈ నెలలోనే ఈ మూవీ సెట్స్ మీదకు తీసుకువెళ్ళబోతున్నారు.
Pushpa 2: అదే తేదీకి సీక్వెల్ను కూడా రిలీజ్..!
మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్తో ఈ సీక్వెల్ను నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఈసారి సీక్వెల్ కోసం మరో లెవల్లో సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారట. అయితే, మేకర్స్ తాజాగా పుష్ప సినిమా సీక్వెల్ను కూడా డిసెంబర్ 17నే రిలీజ్ చేయనున్నారట. పార్ట్ 1 ఇదే తేదీన వచ్చి సంచలన విజయం సాధించడంతో అదే తేదీకి సీక్వెల్ను కూడా రిలీజ్ చేయాలని గట్టిగా మేకర్స్ డిసైడయ్యారట. వాస్తవంగా ఇంకా ముందే పార్ట్ 2 రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ, సెంటిమెంట్ ఫాలో అయితే బావుంటదనే ఉద్దేశ్యంతో మళ్ళీ కూడా డిసెంబర్ 17కి పుష్ప: ది రూల్ రానుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!